12 June, 2026 | 1:01 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

ఎన్నికల దృష్టి మళ్లించేందుకే నోటీసులు

23-01-2026 12:33 AM

తలసాని సాయి కిరణ్ యాదవ్

సనత్నగర్, జనవరి 22 (విజయక్రాంతి): - మొన్న హరీష్ రావు కు,ఇవాళ కేటీఆర్,  నోటీసులు ఇవ్వడం కేవలం రాజకీయ కక్షసాధింపు చర్యే అని తలసాని సాయి కిరణ్  యాదవ్ కాంగ్రెస్  ప్రభుత్వం పాలనను వదిలేసి, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో యూరి యా దొరకక రైతులు అల్లాడుతున్నా, రైతు భరోసా ఊసే లేదని ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని, రెండేళ్లుగా దర్యాప్తు చేసినా ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడటం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా వాటన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.