1 June, 2026 | 12:03 PM

Breaking News

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •   బిగ్ షాక్... మరోసారి పెరిగిన సిలిండర్ ధరలు.. ఎంతంటే?   •   సీఎం పర్యటన బందోబస్తుపై పోలీసు అధికారులకు ఎస్పీ నితికా పంత్ బ్రీఫింగ్   •   రామేశ్వరం కోనేరులో పడి మహిళ మృతి   •   ఆర్యవైశ్య మహాసభ పట్టణ అధ్యక్షుడిగా బిల్లకంటి హరిబాబు గెలుపు   •   సింగరేణిలో మహిళా ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహణ   •   భద్రాచలంలో విలేకరుల ముసుగులో అక్రమదందా   •   కేసీఆర్‌తో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి భేటీ   •   జాగరి గట్టమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ సదానందం   •   హైదరాబాద్‌లో అవార్డు అందుకున్న ఆదివాసి బిడ్డ   •  

వృద్ధ దంపతుల వంటా వార్పు

26-10-2025 12:00 AM

ఇంటికి వెళ్లడానికి ఉన్న రోడ్డును కబ్జా చేశారంటూ జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన

ధర్మపురి, అక్టోబర్ 25 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట గ్రామానికి చెందిన నూకల నర్స వ్వ దంపతులు. వారి ఇంటికి వెళ్లడానికి ఉన్న రోడ్డును కొర్రి గంగయ్య కుటుం బం కబ్జా చేశారంటూ శనివారం జగిత్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట నర్సవ్వ, మల్ల య్య దంపతులు వంటావార్పుతో నిరసన వ్యక్తం చేశారు.

కొర్రి గంగయ్య కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల స్థలలు రాగా పక్కనే ఉన్న తమ పట్టా భూమి నుంచి ఉన్న రోడ్డును కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు సంవత్సరాలుగా అధికారుల చుట్టూ తిరిగుతున్నా పట్టించు కోవడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు. హైదరాబాద్‌లో ప్రజా దర్బార్‌లో సైతం ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సమస్యను పట్టించుకోకాపోగా బెదిరింపులకు గురిచేస్తున్నారని వాపోయారు.