14 July, 2026 | 6:58 PM

Breaking News

ప్రజా భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలుకై సబ్-ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •  

కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం

13-01-2026 02:10 AM

మహబూబాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అంబేద్కర్ విగ్రహం పూర్తిగా కనిపించకుండా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్ళు వెత్తాయి. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా కట్టిన ఫ్లెక్సీని తొలగించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, ప్రచార పోస్టర్లు అంటించకూడదని, ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను పిల్లి సుధాకర్ కోరారు.