13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పరాజయం పాలైనా..

13-01-2026 02:12 AM

మహబూబాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీ చేసిన అభ్యర్థులు కొన్నిచోట్ల ఓటర్లకు పంచిన డబ్బులు తిరిగి వసూలు చేసుకుంటుండగా, ఇందుకు భిన్నంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ గా పోటీచేసి ఓటమిపాలైన సర్పంచ్ అభ్యర్థి చింతకుంట్ల పారిజాతం ఎన్నికల సమయంలో గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు సొంత డబ్బులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించి పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చేతుల మీదుగా ప్రారంభింపజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ఓటమిపాలైనప్పటికీ సర్పంచ్ అభ్యర్థి పారిజాతం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం హర్షనీయమన్నారు. ఓడిపోయిన సర్పంచులు కొంతమంది పలుచోట్ల ఓటర్లకు పంచిన డబ్బులు, ఇతర వస్తువులను బలవంతంగా తిరిగి తీసుకుంటున్న నేపథ్యంలో పారిజాతం అలాకాకుండా సర్పంచిగా గెలిపించకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి హామీని నిలబెట్టుకు నేందుకు సొంత డబ్బులు ఇచ్చి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల అభినందించారు.