14 April, 2026 | 5:19 PM

Breaking News

జగన్నాధపురంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •  

సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే ప్రభుత్వ లక్ష్యం..

25-11-2025 07:09 PM

ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

బాన్సువాడ (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని చందూర్ మండల పరిధిలో మంగళవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్​తో  కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా చందూర్ చెరువులో ప్రభుత్వం సరఫరా చేసిన ఉచిత చేప పిల్లలను విడుదల చేశారు.

చేపల పెంపకదారులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని వివరించారు. మేడిపల్లి గ్రామంలో రూ.11 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాంను ప్రారంభించారు. అనంతరం లక్ష్మాపూర్ గ్రామంలో రూ. 30 లక్షలతో నిర్మించిన సొసైటీ సబ్‌సెంటర్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. చందూర్ మండల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారన్నారు. గ్రామీణ ప్రజలు, రైతులు, మత్స్యకారులకు మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చందూర్, మోస్రా, వర్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.