17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

సహృదయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు

25-11-2025 08:37 PM

హన్మకొండ (విజయక్రాంతి): సహృదయ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో 2026 జనవరి 1 నుండి 4వ తేదీ వరకు సాహిత్య సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించబడతాయని సంస్థ కన్వీనర్ డి.ఎస్.ఎన్ మూర్తి, అప్పా జోశ్యుల సత్యనారాయణలు అన్నారు. మంగళవారం హనుమకొండలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అజో విభూ కందాలం ఫౌండేషన్(అమెరికా), సహృదయ సాంస్కృతిక సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ ఉత్సవాలు, హన్మకొండలోని కాళోజి కళాక్షేత్రంలో నిర్వహించ బడతాయని, ఇవి మాత్రమే కాకుండా మూడు రోజులు ప్రత్యేకంగా ఉభయ రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన తెలుగు కథా నాటకాలు, ప్రదర్శనలు ఉంటాయని, ప్రతిరోజు మూడు నాటకాలు, మొత్తం తొమ్మిది నాటకలు ఉంటాయని, రంగస్థల సేవ చేసిన ఒక వ్యక్తికి పదివేల రూపాయల రంగస్థలం పురస్కారం ఉంటుందన్నారు.

ముగ్గురికి సాహిత్య పురస్కారం అందిస్తున్నామని, డాక్టర్ జి.వి. రత్నం, వరంగల్, 2026 సంవత్సరం- ప్రతిభా మూర్తి జీవితకాల సాధన పురస్కారం క్రింద ఒక లక్ష రూపాయలు సన్మానం ఉంటుందన్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, తిలకించి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జి. గిరిజ మనోహరబాబు, వనం లక్ష్మీ కాంతారావు, ఏ.వి. నరసింహారావు, కె కృష్ణమూర్తి, న్యాలకొండ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.