22 June, 2026 | 3:17 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి

28-10-2025 05:52 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తిరుమలనగర్ జానపద వృత్తి కళాకారుల సంఘం జిల్లా స్థాయి సమావేశం మంగళవారం రోజున జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు తాళ్ల పెళ్లి వెంకటలక్ష్మి గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల గుర్తింపు కార్డు ఇవ్వాలని, వృద్ధ కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని, ఆరోగ్య కార్డులు ఉచితంగా ఇవ్వాలని, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా గుర్తింపు మంజూరు చేయాలని కార్యక్రమాలకు కళాకారులకు ఆర్థిక సాయం అందించాలని, కళాకారులు అడిగే డిమాండ్లు న్యాయబద్ధమైనయని ఆమె అన్నారు.

వచ్చే నెలలో హైదరాబాదులో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తదుపరి మరొక అతిధి రాష్ట్రస్థాయి సిల్వర్ గోల్డ్ అవార్డు గ్రహీత వలస సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కళాకారులు ఐక్యమత్యంతో ఉండి వారి హక్కులను సాధించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గం దాట్ల నిర్మల, ఎద్దు మమత, మల్యాల కొమురయ్య, న్యాతరి పద్మ, పెరుమల్ల గంగయ్య, బూడిద అనసూర్య, శ్యామల, కేశబోయిన రమాదేవి, చిలక రజిత, ఆడెపు రజిత, ఈర్ల స్వాతి, వాణి, రజిత, మమత, సముద్రాల ఓంకార్, దాట్ల నిర్మల,తాండ్ర స్వర్ణలత, బండారి స్వప్న, ఉప్పు మల్లేశ్వరి, మిడిమిల్లి రేణుక, గిట్ల సునీత,మామిడి రాజేశ్వరి, బుర్ర సరూప, భూమా సవిత మరియు కళాకారులు పాల్గొన్నారు.