12 June, 2026 | 1:00 PM

Breaking News

మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •   ప్రముఖ 'మాండ్' గాయని గావ్రీ దేవి కన్నుమూత   •   తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •  

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై జరిగే మహాధర్నా విజయవంతం చేయాలి

01-12-2025 10:10 PM

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం..

గంభీరావుపేట (విజయక్రాంతి): జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై డిసెంబర్ 3న జరగబోయే మహా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఖండించారు. అక్రెడిటేషన్ పాలసీని వెంటనే ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించి, అర్హులైన జర్నలిస్టులకు గృహస్థలాలు మంజూరు చేయాలన్నారు.

సంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరగతి పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం అందరూ ఐక్యంగా ధర్నా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు పాపగారి యాదగిరిగౌడ్, ఎర్ర శ్రీనివాస్, ఉపాధ్యక్షులు అర్జున్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అరిగే రమేష్, సంయుక్త కార్యదర్శి పల్లె శ్రీనివాస్, కోశాధికారి సిరిపురం ఆంజనేయులు, సభ్యులు సంతోష్ చారి, షబ్బీర్, బొంగు మల్లేశం, గుడికాడ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.