12-07-2025 12:00:00 AM
జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్ల మండలం పూసగుప్ప గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మితమైన మొబైల్ హాస్పిటల్ మరియు అంబులెన్సు సేవలు ప్రారంభం :ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్
చర్ల, జులై 11, (విజయ క్రాంతి):అతి మా రుమూల ప్రాంతాల్లో సైతం విద్య వైద్యం రవాణా సౌకర్యం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం కొనసాగుతుందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు.
శుక్రవారం చర్ల మండలం పూసకుప్ప గ్రామంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూ 1 కోటి వ్యయంతో ఏ ర్పాటు చేసిన మొబైల్ ఆసుపత్రి, అంబులె న్స్ సేవలను ఆయన కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ లతో కలిసి ప్రా రంభించారు.చర్ల మండలం చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన పూసుగుప్ప లో స్పెష ల్ సెంట్రల్ అసిస్టెన్స్ నిధుల ద్వారా ఈ మొ బైల్ హాస్పటల్ను నిర్మించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూచర్ల మండలం లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షే మం కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారథ్యంలో పోలీస్ శాఖ విశేష సేవలను అంది స్తుందని ఆయన కొనియాడారు. పూసుగుప్ప గ్రామ పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే భద్రాచలం, కొత్తగూడెం పట్టణా లకు, వెళ్లడానికి ఒకప్పు డు సరైన రహదారి కూడా లేదని,
కానీ ఇ ప్పుడు ఇదే పూసుగుప్ప గ్రామానికి చర్ల నుం డి అరగంట వ్యవధిలోనే చేరుకునే విధంగా రహదారిని, ప్రస్తుతం ఈ హాస్పిటల్ ని ప్రా రంభించడం లో చర్ల పోలీసుల కృషినీ ఆ యన కొనియాడారు..ఆదివాసీ ప్రజల సం క్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఒ క్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గా రు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అందవలసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆదివాసీ ప్రజలకు అందజేయడం లో జిల్లా పోలీసుల కృషి అమోఘం అన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఏజెన్సీ ప్రాంత వాసులకు ఎల్లప్పుడూ అండగా ఉం టుందని తెలిపారు.
ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించడంలో స్థానిక పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఆదీవాసీ ప్రజలకు అందు బాటులో ఉంటారని తెలిపారు. రాబోయే వ ర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని సూ చించారు.
సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్ర గ్రామాలైన రాంపురం,భీమారం గ్రామాల ప్రజలు కూడా ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్బంగా తెలిపారు. అ నంతరం అంబులెన్స్ వాహన సేవలను ప్రా రంభించారు. ఇటీవల పూసుగుప్ప నుండి రాష్ట్ర సరిహద్దు వరకు నూతనంగా నిర్మితమైన బీటి రోడ్డును పరిశీలించారు.
ఈ కార్య క్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కు మార్ సింగ్ ,చర్ల ఇన్స్పెక్టర్ రాజు వర్మ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ చెన్నూరి శ్రీనివా స్, శ్రీనివాస్, ఎస్త్స్రలు నర్సిరెడ్డి, కేశవ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.