calender_icon.png 18 December, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నూతన గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం

17-12-2025 12:00:00 AM

కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో, దోమకొండ పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచయతీ ఎన్నికలలో ఎన్నికైన నూతన ఉప సర్పంచ్ , వార్డ్ సభ్యులకు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఉపసర్పంచ్ గా ఎన్నికైన శ్రీ బొమ్మెర శ్రీనివాస్, మరియు వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ కుమార్, ఐరెని లత రాజేందర్,  బొబ్బసాని రమ్య సుధాకర్ ను సన్మానించారు. 

ఈ సన్మాన కార్యక్రమంలో పార్టీ సీనియర్  నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, పట్టణ అధ్యక్షులు బోరెడ్డి కిషన్ రెడ్డి ఆసంశెట్టి పోచయ్య, నాగరాజు రెడ్డి, మన్నె సాయి రెడ్డి, పార్టీ నాయకులు కానుగంటి నాగరాజు , చిట్యాల రాజిరెడ్డి, కూర చంద్రం, మల్లెబోయిన రాజు, బొమ్మెర గంగాధర్, చెన్ను గారి నర్సింలు, అనుమాల అశోక్ , అవధూత సహదేవ్, కట్ట నారాయణ, ముద్దసాని చంద్రం, నిమ్మ రాజనర్సు, దోమకొండ పోచయ్య  పాల్గొన్నారు.