15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నూతన గ్రామపంచాయతీ ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు సన్మానం

17-12-2025 12:00 AM

కామారెడ్డి, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో, దోమకొండ పట్టణ బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామపంచయతీ ఎన్నికలలో ఎన్నికైన నూతన ఉప సర్పంచ్ , వార్డ్ సభ్యులకు పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. ఉపసర్పంచ్ గా ఎన్నికైన శ్రీ బొమ్మెర శ్రీనివాస్, మరియు వార్డు సభ్యులు పాలకుర్తి శేఖర్, బీసు సతీష్ కుమార్, ఐరెని లత రాజేందర్,  బొబ్బసాని రమ్య సుధాకర్ ను సన్మానించారు. 

ఈ సన్మాన కార్యక్రమంలో పార్టీ సీనియర్  నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, పట్టణ అధ్యక్షులు బోరెడ్డి కిషన్ రెడ్డి ఆసంశెట్టి పోచయ్య, నాగరాజు రెడ్డి, మన్నె సాయి రెడ్డి, పార్టీ నాయకులు కానుగంటి నాగరాజు , చిట్యాల రాజిరెడ్డి, కూర చంద్రం, మల్లెబోయిన రాజు, బొమ్మెర గంగాధర్, చెన్ను గారి నర్సింలు, అనుమాల అశోక్ , అవధూత సహదేవ్, కట్ట నారాయణ, ముద్దసాని చంద్రం, నిమ్మ రాజనర్సు, దోమకొండ పోచయ్య  పాల్గొన్నారు.