31-05-2025 12:00:00 AM
రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి జాయింట్ డైరెక్టర్ ఉషారాణి
సదాశివనగర్, మే 30(విజయక్రాంతి),; ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ మండలి జాయింట్ డైరెక్టర్ జిల్లా పరిషీలకురాలు ఉషారాణి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి జాయింట్ డైరెక్టర్ ఉషారాణి కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు యువకులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయ బృందంతో కూడిన సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విలువలతో కూడిన విద్య బోధన జరుగుతుందని,ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను వసతులను గురించి తెలియజేశారు.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి సమాజ భాగస్వామ్యం చాలా అవసరమన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణ తరగతులను స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులని పరిశీలించి అభినందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను 7 నుంచి 56 కు పెంచిన స్థానిక ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా విద్యాధికారి రాజు, ఏఎమ్ఓ వేణు,కల్వరాల్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు కుంట రాజారెడ్డి స్థానిక యువకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.