11 May, 2026 | 11:52 AM

Breaking News

యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •   రేపు హమాన్ జయంతి సందర్భంగా విశేష పూజలు, ర్యాలీ   •   పేద రోగులకు సేవ చేయాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నది   •   రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు   •   తొమ్మిదేళ్ల తర్వాత చైనాకు ట్రంప్, షెడ్యూల్ ఖరారు   •   అర్ధరాత్రి అమానుషం.. పోలీస్ కానిస్టేబుల్ హత్య   •   ORRపై రోడ్డు ప్రమాదం: నలుగురికి తీవ్రగాయాలు   •  

ప్రాణాలు తీసిన వర్షం

09-05-2024 12:05 AM

మంగళవారం తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమయ్యారు. ‘ఇదేం వానరా బాబు’ అని తలలు పట్టుకొనే పరిస్థితి. ఒక డ్రైవర్, ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి. బహదూర్‌పురాలో ఒక వ్యక్తి విద్యుత్ స్తంభాన్ని తాకడం ద్వారా ప్రాణాలు పోగొట్టుకోవడం అత్యంత దురదృష్టకరం. మియాపూర్‌లో 13.3 సెం.మీ. వర్షపాతం నమోదైంది కనుకే, ఆ పరిసర ప్రాంతాల నగరవాసులు రోడ్లమీద నరకయాతన పడ్డారు. వడగల్లు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో వాతావరణం భయానకంగా మారింది.

 శివకుమార్, ఉప్పల్