20 March, 2026 | 11:18 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

‘రెడ్ కార్పెట్’ వివాదం

22-05-2025 01:30 AM
  1. బెంగళూరును ముంచెత్తిన అకాల వర్షాలు

రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలకడంపై విమర్శలు

బెంగళూరు, మే 21: కర్ణాటక రాజధాని బెంగళూరును అకాల వర్షాలు ముంచెత్తాయి. 36 గంటలుగా కురుస్తున్న వర్షాలతో సాధారణ జీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బుధవారం బెంగళూరులోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో బెంగళూరు మున్సిపల్ అధికారులు హెబీ ఆర్ లేఔట్లో ఓపెన్ స్టార్మ్ వాటర్ డ్రె యిన్ ఎదుట రెడ్ కార్పెట్‌ను ఏర్పాటు చేయడం విమర్శలకు దారి తీసింది.

ఒక పక్క వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పరామర్శించడానికి వచ్చిన సీఎంకు, డిప్యూటీ సీఎంకు అధికారులు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలకడాన్ని అక్కడున్న వారం తా తప్పుబట్టారు. అధికారుల తీరుపై స్థానికులు సహా బీజేపీ నేతలు ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు వెంటనే రెడ్ కార్పెట్‌ను  తొల గించడంతో వివాదం సద్దుమణిగింది.