30 June, 2026 | 11:29 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైస్ మిల్లు దొడ్డు వడ్లు దించుకోవాలి

08-05-2025 12:30 AM

వనపర్తి, మే 7 (విజయక్రాంతి) : ప్రతి రైస్ మిల్లు 5000 బస్తాల దొడ్డు వడ్లు ఖచ్చితంగా దించుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు మిల్లర్లను ఆదేశించారు.  బుధవారం వనపర్తి మండలంలోని చిట్యాల గోదాము, చీమనగుంట పల్లి లోని స్వామి రైస్ మిల్, నాగవరం లోని పవనపుత్ర రైస్ మిల్లుల్ని అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మిల్లుకు దొడ్డు వడ్లు వస్తె దింపుకొను అని పక్కన పెట్టడానికి వీలు లేదని కచ్చితంగా ప్రతి మిల్లు 5000 బస్తాల దొడ్డు బియ్యం దించుకోవాలని ఆదేశించారు.  అదేవిధంగా వచ్చిన లారీలను పోయించాలని త్వరగా అన్లోడ్ చేసే విధంగా హమాలీల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక లారీ పెట్టాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను  ఆదేశించారు.