11-07-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
వేములపల్లి, జూలై 10 : పారదర్శక ఓటరు జాబితా తయారీలో బూత్ స్థాయి అధికారు ల (బి ఎల్ ఓ ) పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్. ఇలా త్రిపాఠి అన్నారు.కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బూత్ స్థాయి అధికారులకి ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గురువారం వేములపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బిఎల్ ఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ఇలా త్రిపాటి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తప్పులు లేని,పారదర్శక ఓటరు జాబితా తయారీలో బిఎల్ ల పాత్ర ప్రధానమని, ఓటరు జాబితా తయారీలో అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా రూపొందించాలని, ప్రజాస్వామ్యానికి ఓటరూ జాబితా ముఖ్యమని,అర్హులుమాత్రమే ఓటరుగా ఉండేలా చూడాలని, నాయకుల ఎంపికలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు.
అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్యమైన భారత దేశంలో ఎన్నికల్లో ఓటరు జాబితా కీలకమన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని బి ఎల్ ఓ లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిక్షణ సందర్భంగా సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు. వేములపల్లి తహసిల్దార్ హేమలత ,మాస్టర్ ట్రైనర్లు హాజరయ్యారు.