27-05-2025 12:00:00 AM
--శ్రద్ధగా శిక్షణ పొంది రైతులకు న్యాయం చేయాలి
--లైసెన్స్ డ్ సర్వేయర్స్ శిక్షణ ప్రారంభం
నారాయణపేట. మే 26(విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి లో లైసెన్స్ సర్వేయర్ల పాత్ర ఎం తో కీలకమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సోమవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపు ణ్య శిక్షణా కేంద్రంలో లైసెన్స్ డ్ సర్వేయర్స్ మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి లో నిరుద్యోగ లైసెన్సుడ్ సర్వే శిక్షణ పొందేందుకు జిల్లాలో ఐటిఐ, సివిల్ ఇంజనీరింగ్ చేసిన నిరుద్యోగులను ఎంపిక చేసి నట్లు తెలిపారు. అందులో భాగంగా జిల్లా లో మొదటి బ్యాచ్ కింద 109 లైసెన్స్ డ్ సర్వేయర్లకు సోమవారం నుంచి 50 రోజుల పాటు అనుభవజ్ఞులైన వారిచే సర్వే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ లైసెన్స్ సర్వేయర్లకు గెట్టు, భూమి హద్దులు, రెవె న్యూ చట్టాలు హక్కులపై తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వాస్తవానికి జిల్లాలో చాలా సర్వే సమస్యలు ఉన్నాయని, ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భూ సర్వేలకు సంబంధించిన వినతులే ఉంటున్నాయని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలో కేవలం 5 మంది సర్వేయర్లు మాత్ర మే ఉన్నారని, ప్రతీ మండలానికి వారు వెళ్ళడం చాలా కష్టంగా మారిందన్నారు. ఈ భూ సర్వే సమస్యల పరిష్కారానికి కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్న విధానాన్ని మనం కూడా అమలు చేస్తున్నామని ఆమె తెలిపారు.
నిత్య జీవితంలో ఎన్ని మార్పులు, సాంకేతిక మార్పులు, కంప్యూటర్స్, ఇతర సాఫ్ట్ వేర్ టెక్నాలజీలు రోజు రోజుకు కోత్తగా వస్తున్నాయని, టెక్నాలజీ పెరుగుతున్నదని, ఎన్ని మార్పులు జరిగినా కూడా ఈ భూముల విషయంలో మాత్రం సహజంగానే అలాగే ఉన్నామని, అందుకే ఈ భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎలాంటి గెట్టు తగాదాలు లేకుండా ఉండేందుకుగాను, హద్దులను కాపాడేందుకుగాను, సర్వేయర్ ల కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘భూ భారతి‘ చట్టం ప్రారంభించిందని తెలిపారు.
ఈ చట్టం ద్వారా భూములు, లావా-దేవిలు, జరిగినప్పుడు సర్వే చేసీ హద్దులను నక్షాల్లో పొందుపరిచిన తర్వాత రిజిస్ట్రేషన్లు జరుగుతాయని, దీనివల్ల తగాదాలకు చోటు ఉండదని కలెక్టర్ తెలిపారు. నిరుద్యోగ యువతి యువకులు శ్రద్ధగా ఈ ట్రైనింగ్ పూర్తి చేసీ రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలని కలెక్టర్ కోరారు.
శిక్షణలో థియరీ, ప్రాక్టికల్ శిక్షణను సర్వేయర్లు ఇస్తారని, శిక్షణలో పాల్గొన్న యువతి యువకులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాకు చెందిన మొదటి బ్యాచ్ 109 మందికి ట్రైనింగ్ ఇచ్చి, ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన వారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
అనంతరం శిక్షణ మెటీరియల్ ను కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్, డీ.ఐ.లు థాను, తయాబ్ సుల్తానా, సర్వేయర్లు రంగయ్య, జయశంకర్, కృష్ణయ్య, రవి, రాజన్న, అరుణ పాల్గొన్నారు.