10 May, 2026 | 2:49 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

సిగాచీ అగ్నిప్రమాదం నివేదికను బయటపెట్టాలి

30-07-2025 12:10 AM

బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సిగాచీ అగ్నిప్రమాదం జరిగి నెలరోజులవు తున్నా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహారిస్తోందని బీఆర్‌ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. 8 మంది జాడ ఇంకా తెలియకపోవడం, శవాలను కూడా కనిపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. బీఆర్‌ఎస్ నేతలను తిట్టడంపై ఉన్న శ్రద్ధ సిగాచీ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో శ్రీనివాస్ మాట్లాడుతూ సిగాచీ ఘటనపై వేసిన హై లెవల్ కమిటీ నివేదికను వెంటనే బయటపెట్టాలని, కోటి రూపాయల నష్టపరిహా రం వెంటనే అందించాలన్నారు.