calender_icon.png 8 June, 2025 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీల అమలులో రాష్ట్రప్రభుత్వం విఫలం

27-11-2024 01:10:40 AM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

ఎల్బీనగర్, నవంబర్ 26: ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కొత్తపేటలోని బీజేఆర్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన సీపీఐ ఎల్బీనగర్ నియోజకవర్గ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దేశసంపదను దోచి పెడుతున్నదన్నారు. ఆ కార్పొరేట్ శక్తులు లంచాలతో వ్యవస్థలను కొంటున్నాయన్నారు. ఇటీవల ఆదానిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ నాయకులు శేఖర్‌రెడ్డి, పాలమాకుల జంగయ్య, అందోజు రవీంద్రాచారి, పల్లె నర్సింహ పాల్గొన్నారు.