08-01-2026 12:34:26 AM
నిర్మల్, జనవరి 7 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు రిపోర్టులతో సర్వేల పేరుతో ఆక్రమాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారిని వెంటనే గుర్తించాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ సభ్యులు బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
పత్రికల్లో వచ్చిన వార్తలను తామే రాయించామని ప్రచారం చేసుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కొందరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వెంటనే గ్రూప్ సభ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయ సంఘ నాయకులు శ్రీధర్ లచ్చన్న రవి భూమయ్య మహేష్ మహేష్ రావు వాసిన్ చారి యోగేష్ తదితరులు ఉన్నారు.