16 April, 2026 | 10:06 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మాట ఇచ్చారు మంత్రులను చేశారు

09-06-2025 12:10 AM
  1. దళితులను మోసం చేసిన కేసీఆర్ 

మచ్చ నర్సింహారావు

అశ్వాపురం జూన్ 8 (విజయ క్రాంతి): కెసిఆర్ హయాంలో దళితులకు అన్యాయం జరిగిందని అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మచ్చ నరసింహారావు అన్నారు. మల్లెల మడుగులో ఆదివా రం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కెసిఆర్ దళిత వర్గాన్ని గత పదేళ్లుగా నట్టేట ముంచారని గుర్తు చేశారు.

ఇప్పటికీ దళితులు కాంగ్రెస్ పార్టీని నమ్మటానికి కారణం నేడు సామాన్య హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడు అంటే, సమున్నత స్థాయికి వచ్చాడు అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలే కారణమని తాను విశ్వసిస్తున్నానన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హ యాంలో కేసీఆర్ ఒకే ఒక దళితుడికి మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి అనతి కాలంలోనే తొ లగించార అని గుర్తు చేశారు.

నేటి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి హయాంలో దళితులకు నాలుగు కీలకమైన మంత్రి పదవులను ఇచ్చి దళితులకు పెద్దపీట వేసినం దుకు గాను యావత్ తెలంగాణ దళిత సా మాజిక వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయని తెలిపారు. కెసిఆర్ చేసిన అప్పు లకు ఎనిమిది వేల కోట్ల వడ్డీని ఇప్పటికి కాం గ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ప్రజా ఆదరణ పొందుతున్నదన్నారు.

దళితులను పట్టించుకోకుండా పదవులు కూడా ఇవ్వకుండా పదేండ్లు సాగిన బిఆర్‌ఎస్ పార్టీ రా బోయే రోజుల్లో ఇక తెలంగాణలో కనుమరుగైపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో బేతం రామకృష్ణ, చెంచల రాము,గొడ్ల నాగేశ్వరరావు, యాకూబ్, వెంకటి, రాణి, వీరయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.