3 April, 2026 | 7:06 AM

వేదాంత నుంచి మూడో డివిడెండ్

29-08-2024 12:00 AM

వచ్చేవారం బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, ఆగస్టు 28: మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ ఇన్వెస్టర్లకు మరో నజరానా పంచనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి మూడవ మధ్యంతర డివిడెండును ఆమోదించేందుకు వచ్చే సోమవారం బోర్డు సమావేశమవుతుందని వేదాంత బుధవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. గత నెలలోనే షేరుకు రూ. 4 చొప్పున రెండవ మధ్యంతర డివిడెండును వేదాంత ఆమోదించింది.