05-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సెల్ ఫోన్లు పోయినవారు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే వాటిని పట్టుకొని పోగొట్టుకున్న వారికి అందించడం జరుగుతుందని ఎస్పీ జానకి షర్మిల అన్నా రు.
సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయం లో పోగొట్టుకున్న సెల్ఫోన్ లబ్ధిదారులకు 70 మందికి సెల్ఫోన్లను అప్పగించారు విలువైన ఫోన్లు పోయినప్పుడు వెంటనే ఆన్లైన్లో మీ సేవలో దరఖాస్తు చేసుకొని పోలీస్ అప్పగించాలని సూచించారు. వీటి విలువ 8.40 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.