05-05-2025 06:26:01 PM
నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలంలోని మాడిగం గ్రామంలో సోమవారం పంటచేరిలో జొన్నలేప తిని మూడు ఆవులు మరణించినట్టు రైతు విజయ్ తెలిపారు. పశువుల మేత కోసం వెళ్ళిన ఆవులు లేత జున్ను ఆకులను తినడంతో అస్వస్థకు గురై మృతి చెందగా 30 వేల ఆర్థిక నష్టం జరిగినట్టు రైతు వివరించారు. సంఘటన స్థలాన్ని పశు వైద్యాధికారులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.