15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

కారు ఢీకొని ముగ్గురికి గాయాలు

16-11-2025 12:33 AM
  1. జనగామ జాతీయ రహదారిపై ఘటన

దర్యాప్తు చేస్తున్న పోలీసులు

తుంగతుర్తి, నవంబర్ 15(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రం లో జనగామ--- -సూర్యాపేట జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు.. పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో   జనగాం నుంచి సూర్యాపేట కు వెళ్తున్న ఒక గుర్తుతెలియని కారు నాగారం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కమలాకర్‌తో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఇద్దరిని ఢీకొంది.

దీంతో కానిస్టేబుల్‌కు, మరో ఇద్దరికి తీవ్ర గాయాల య్యాయి. బాధితులను సూర్యాపేట జనరల్ హాస్పటల్‌కి తరలించారు. కమలాకర్ పరిస్థితి కొంచెం విషమంగా ఉంది. ఈ ఘటనపై పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.