25-07-2025 09:37:17 AM
తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanam) భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు ప్రకటించారు. శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 68,838 మంది భక్తులు తిరుమల వెంకన్నను దర్శించుకోగా, 22,212 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.49 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు పేర్కొన్నారు.