calender_icon.png 26 July, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌కు సీఎం

25-07-2025 09:04:00 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana Chief Minister) రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. మంత్రివర్గ సమావేవంలో కొత్త పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే అవకాశముంది. ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు, కులగణనపై అధిష్టాన పెద్దలతో చర్చించారు.

తెలంగాణలో వెనుకబడిన తరగతులకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి కోరారు. ఇది మొత్తం దేశానికి బెంచ్ మార్క్ గా నిలుస్తుందన్నారు. లోక్‌సభ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,  మల్లికార్జున్ ఖర్గే ఉభయ సభలలో పోరాటానికి నాయకత్వం వహించాలని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఊపు పెంచాలని ఆయన కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేపై ఢిల్లీలో రాహుల్, ఖర్గే, వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాతో సహా పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ, 60 రోజుల్లోపు ఆ పనిని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఖచ్చితమైన ప్రయత్నాలు చేసిందో ముఖ్యమంత్రి వివరించారు.