17 April, 2026 | 2:30 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ముగిసిన ఆదివాసీల జాతర

28-01-2026 12:23 AM

నాగోబా హుండీ ఆదాయం రూ.20.74 లక్షలు

ఉట్నూర్, జనవరి 27 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసీల పండుగ నాగోబా జాతర ముగిసింది. ఈ నెల 18న నాగోబాకు మహా పూజలతో ప్రారంభమైన జాతర వారం రోజుల పాటు కొనసాగింది. నాగోబాకు డిసెంబర్ 22 న పూజలు ప్రారంభించిన మెస్రం వంశీయులు మంగళవారం గ్రామంలోని మురడి ఆలయంలో నాగోబాకు శుద్ధి పూజలు చేశారు. నాగోబా జాతర సందర్భంగా తై బజార్‌తో పాటు హుండీ లెక్కించడంతో రూ.20.74 లక్షల ఆదాయం వచ్చింది. తై బజార్ వల్ల రూపాయలు  11.81 లక్షలు, నాగోబా హుండీ ద్వారా 8.93 లక్షల ఆదాయం వచ్చినట్లు దేవాదాయశాఖ అధికారులు, మెస్రం వంశస్థులు, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు తెలిపారు.