20 March, 2026 | 9:18 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

ఒకే కాన్పులో ముగ్గురు జననం

29-07-2025 12:00 AM

ఆరోగ్యంగానే తల్లి, పిల్లలు 

మహబూబాబాద్, జూలై 28 (విజయక్రాంతి): సాధారణంగా ఒక కాన్పులో ఒక్కరు లేదంటే ఇద్దరు జన్మించడం పరిపాటి. అయితే మహబూబాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో విఎస్ లక్ష్మీపురం గ్రామానికి చెందిన గుండెబోయిన కళ్యాణికి ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు జన్మించారు.

మూడు రోజుల క్రితం పురిటి నొప్పులు రావడంతో బంధువులు కళ్యాణిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. సోమవారం వైద్యులు కళ్యాణికి ఆపరేషన్ చేసి కాన్పు నిర్వహించగా ఇద్దరు ఆడ పిల్లలు, ఒక మగబిడ్డ జన్మించారు. ముగ్గురు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.