29-07-2025 12:00:00 AM
మహబూబాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. దీనితో ఉమ్మడి వరంగల్ జిల్లా లోని పలు దేవాలయాలు శ్రావణ శోభను సంతరించుకున్నాయి. భూపాలపల్లి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన కోట గుళ్ళు గణపేశ్వరా లయంలో శ్రావణ మాసం వేడుకలు ఘనంగా ప్రారంభించారు.
ఉదయం గణపతి పూజ, నందీశ్వరునికి అభిషేకం, గణపేశ్వర స్వామికి రుద్రాభిషేకం, పార్వతీ పరమేశ్వరులకు ఒడిబియ్యం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అర్చకుడు నాగరాజు భక్తులకు ఆశీర్వచనం, తీర్థప్రసా దాలు అందజేశారు. ఇక మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాల యానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుండి స్వామివారిని దర్శించు కునేందుకు బారులు తీరారు. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప, వేయి స్తంభాల దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయాయి.