11-01-2026 12:00:00 AM
జనగామ దారిలో ఘటన
మహబూబాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): జనగామసూర్యాపేట జాతీయ రహదారిపై నవాబుపేట వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నెల్లుట్లలో జరిగిన ఓ వ్యక్తి మనవడి పుట్టినరోజు వేడుకలకు వనపర్తికి చెందిన దరిపల్లి నరసింహులు, మర్రి తండాకు చెందిన ధరావత్ మోతిరాం బైక్పై వెళ్లి వస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఇద్దరు మరణించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రావణ్కుమార్ తెలిపారు.