ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్.. ఇద్దరు స్పాట్ డెడ్
హైదరాబాద్: కామారెడ్డి(Kamareddy) జిల్లాలో బుధవారం రాత్రి పెద్ద కొడప్గల్ మండలం(Pedda Kodapgal Mandal) జగన్నాథపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎన్హెచ్-161 వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న మోటార్సైకిల్ అదుపుతప్పి ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రైడర్లు తక్షణమే మృతి చెందగా, మూడవ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని పిట్లంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మృతులు, గాయపడిన వారి గుర్తింపు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.






