17 June, 2026 | 12:09 PM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

ఇద్దరు ‘విన్ జో’యాప్ ప్రమోటర్ల అరెస్ట్

29-11-2025 12:00 AM
  1. యాప్ నిర్వాహకులకు చెందిన రూ.505 కోట్ల ఆస్తుల జప్తు

ఆన్‌లైన్ ‘రియల్- మనీ గేమింగ్’పై ఈడీ ఉక్కుపాదం 

న్యూఢిల్లీ, నవంబర్ 28: రియల్ -మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉక్కుపాదం మోపుతున్నది. దేశవ్యాప్తగా ఆన్‌లైన్ మనీ గేమింగ్‌ను ప్రమోట్ చేసే వారిని గుర్తించి, వారి ఆస్తులను జప్తు చేస్తున్నది. దీనిలో భాగంగా తా జాగా ‘విన్ జో’ యాప్ ప్రమోటర్లు పావన్ సింగ్ నందా, సౌమ్య రాథోడ్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. యాప్ నిర్వాహకుల నుంచి నిందితులు భారీ ఎత్తును సొమ్ము తీసుకున్నారని, వాటిని వివిధ విదేశాలకు తరలించారనే అభియోగాలు ఉన్నాయి.

వీరి ఆర్థిక లావాదే వీలపై  ఈడీ లోతైన దర్యాప్తు చేపడుతున్నది. గడిచిన వారం రోజుల్లో ఈడీ విన్‌జో గేమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన దాదాపు రూ.505 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిది. బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును ఫ్రీజ్ చేశారు. ఆ సంస్థ ఒక్క భారత్‌లోనే కాకుండా బ్రెజిల్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ వంటి దేశాల్లోనూ ఆన్‌లైన్ గేమింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.