16 April, 2026 | 1:43 AM

మార్బుల్ మీద పడి ఇద్దరు యువకులు మృతి

24-01-2026 02:18 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మార్బుల్ రాళ్లు మీద పడి ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బంగ్లా తండాలో  శనివారం జరిగింది. ఖమ్మం నుంచి మార్బుల్ తీసుకువచ్చి ఇంటి వద్ద దింపుతుండగా జారడంతో రాళ్ల మధ్య చిక్కుకొని బోడ తరుణ్ (25), అవినాష్ (27) ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు.