23 April, 2026 | 5:08 PM

Breaking News

అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు... జగ్గారెడ్డి సంచలన పోస్ట్   •   ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత.. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్   •   వన్యప్రాణుల క్రమ శిక్షణ   •   ఏటీఎంలో వ్యక్తి మృతదేహం.. మసబ్ ట్యాంక్‌లో కలకలం   •   3 గంటల వరకు తమిళనాడులో 70%, బెంగాల్‌లో 78.77% పోలింగ్‌ నమోదు   •   కాళేశ్వరంపై కాంగ్రెస్, BRS కుమ్మక్కయ్యాయి   •   అకాల వర్షంతో తడిసిన వడ్లు – ప్రభుత్వానికి రైతుల విజ్ఞప్తి   •   ద్రోణి, క్యుములోనింబస్ మేఘాల ప్రభావం.. హైదరాబాద్‌కు వర్ష సూచన   •   ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి   •   పోలీసుల ఆంక్షల మధ్య రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె   •  

‘ఉల్లాస్’ విజయవంతం చేయాలి

20-09-2025 12:07 AM

వెల్దండ, సెప్టెంబర్ 19: స్వయం సహాయక సంఘాల్లో గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడం కోసం అమలు చేస్తున్న ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి రమేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ పాఠశాల ఉపాధ్యాయులకు, వివోఏలకు, వెలుగు సీసీలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అధికారి రమేష్ మాట్లాడుతూ నిరక్షరాస్యులకు విద్యను అందించేందుకు రూ పొందించిన లాస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని అందులో సూచించే విధంగా విద్యను అందించి ప్రతి ఒక్కరిని విద్యావంతుగా తీర్చిదిద్దాలని సూచించారు. సమాజంలో మండల విద్యాధికారి చంద్రుడు ఏపిఎం శ్రీదేవి ఆర్పీలు రాఘవేందర్ రాజు వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వివిధ గ్రామాల విఏవోలు పాల్గొన్నారు.