17 April, 2026 | 2:44 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన..

22-10-2025 05:09 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): ప్రత్తి కొనుగోలుకు నూతన విధానంలో భాగంగా కపాస్ కిసాన్ అనే యాప్ వినియోగించుకునే విధానంపై రైతులకు అగ్రికల్చర్ అధికారులు బుధవారం మండలంలోని డౌడేపల్లి గ్రామ పంచాయతీలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నూతనంగా ప్రవేశపెట్టిన కపాస్ కిసాన్ యాప్ పోస్టర్స్ ను ఏఈఓ సాయిని శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగ ఆయన మాట్లాడుతూ... పత్తి రైతులు మీ యొక్క పాత మొబైల్ నెంబర్ లు పని చేయని యెడల ప్రస్తుతం ఆధార్ కు లింక్ ఉన్న కొత్త ఫోన్ నెంబర్ ను అందరూ మార్చుకోవాలని కపాస్ కిసాన్ అనే యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ సెంటర్ లో ప్రత్తి విక్రయించాలని అన్నారు.

రైతులు స్మార్ట్ ఫోన్ లోని ప్లే స్టోర్ నుండి కపాస్ కిసాన్ అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు. పత్తి విక్రయాలలో యాప్ వినియోగంలో సందేహాలు ఉంటే తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ కొత్త సుజాత, టెక్నీకల్ అసిస్టెంట్ బి. రాజన్న, రైతులు పాల్గొన్నారు.