24 May, 2026 | 2:31 PM

Breaking News

140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •   పేదలకు అండగా ప్రజా ప్రభుత్వం.. గోపాలరావుపల్లెలో సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ   •   ఘనంగా మేడ్చల్ –మల్కాజిగిరి జిల్లా 2వ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ – 2026   •   మండలంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్   •   విద్యతోనే విద్యార్థులకు భవిష్యత్తు   •   పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు   •   శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు   •   కోదాడ సమీపంలో రోడ్డు ప్రమాదం: ఆరుగురికి గాయాలు   •   నీలోఫర్ కేఫ్ పరిధిలో రెచ్చిపోయిన ఆకతాయిలు   •  

వాల్మీకి చరిత్ర చిరస్మరణీయం..

07-10-2025 04:21 PM

తహశీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ గోపి.. 

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: ప్రపంచం ఉన్నంతవరకు రామాయణం, వాల్మీకి చరిత్ర ఉంటుందని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపీ అన్నారు. మండల కేంద్రం అర్వపల్లిలోని ఎమ్మార్వో, ఎంపీడీఓ కార్యాలయాల్లో మంగళవారం ఆదికవి వాల్మీకీ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ తన గురువు బోధనల ద్వారా ప్రేరణ పొంది, పశ్చాత్తాపంతో సద్గుణ మార్గం వైపు మల్లి, ఆత్మ శోధన ద్వారా మహానుభావుడిగా మారి మనందరికీ ఆదర్శప్రాయమైన రామాయణం అనే గ్రంధాన్ని రచించాడన్నారు. వాల్మీకి చూపిన సత్యం, ధర్మం, నీతి మార్గాల్లో నడుచుకుంటూ సమాజానికి సేవ చేయాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో గిర్ధవార్లు జలంధర్ రావు, వెంకట్ రెడ్డి, ప్రసన్న, సూపరిండెంట్ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ నరసింహారాజు, జూనియర్ అసిస్టెంట్ శిల్పిక, సాయిప్రదీప్, టీఏలతో పాటు ఆయా కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.