07-10-2025 04:57:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఈ విద్యా సంవత్సరం పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. మంగళవారం లక్ష్మణ్ చందా మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదో తరగతి విద్యార్థులకు మంచి మార్కులు తెచ్చుకునే విధంగా సబ్జెక్టు ఉపాధ్యాయులు కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.