10 May, 2026 | 7:01 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

బెల్లంపల్లి శ్రీసరస్వతి శిశు మందిర్ లో వైభవంగా వరలక్ష్మి వ్రతాలు

16-08-2024 02:32 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం మహిళలు శ్రావణ వరలక్ష్మి వ్రతాలను వైభవంగా జరుపుకున్నారు. విభాగ్ అకాడమిక్ ఇంచార్జి పూదరి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు సూరం లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానాచార్యులు ఇంగు భాగ్యలక్ష్మి ల ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతాల ఏర్పాట్లు చేశారు. 64 మంది మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాల్లో పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాతృభారతి సభ్యులు లలితా మారు, పల్లెర్ల సింధు, రాజేశ్వరి, కల్పన లతో పాటు పాఠశాల ఆచార్య బృందం, ప్రబంధ కారిణిలు పాల్గొన్నారు.