రాయ్బరేలీ నుంచి పోటీ చేయనని
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: బీజేపీకి ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ షాకిచ్చారు. రాయ్బరేలీ నుంచి పోటీ చేయాలని కోరడంతో వరుణ్ తిరస్కరించారని తెలుస్తోంది. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతుండటంతో ఆమెపై పోటీ చేయాలని వరుణ్గాంధీని బీజేపీ సంప్రదించినట్టు సమాచారం. ప్రస్తుతం వరుణ్ గాంధీ ఫిలిబిత్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే గత కొంత కాలం నుంచి వరుణ్ గాంధీ బీజేపీకి దూరంగా ఉంటున్నారు.