17-06-2025 07:44:31 PM
భద్రాచలం (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చర్ల మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన మహిళ కాకర్లపూడి విజయలక్ష్మికి వసుధ ఫౌండేషన్(Vasudha Foundation) రూ.పదివేల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఆమె వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకట రామరాజును ఆశ్రయించింది. సానుకూలంగా స్పందించిన చైర్మన్ కాకర్లపూడి విజయలక్ష్మికి రూ.10,000 ఆర్థిక సహాయం అందించాలని వసుధ ఫౌండేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజుకు సూచించారు. దీంతో మంగళవారం జరిగిన కార్యక్రమంలో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం విశ్రాంత కార్య నిర్వహణ అధికారి వేగేశ్న రామకృష్ణంరాజు చేతుల మీదుగా కాకర్లపూడి విజయలక్ష్మికి రూ పదివేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో వసుధ ఫౌండేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ వేగేశ్న శ్రీనివాసరాజు పాల్గొన్నారు.