17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిగా వెంకటేశం

31-01-2026 12:00 AM

సికింద్రాబాద్ జనవరి 30 (విజయ క్రాంతి): బోయిన్‌పల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్ గ్రేడ్ వన్ కార్యదర్శిగా ఈ.వెంకటేశం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ ఉన్న కార్యదర్శి వెంకన్న నల్గొండ జిల్లా మిర్యాలగూడ మార్కెట్ కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో అక్కడి నుండే ఈ. వెంకటేశం ఇక్కడికి వచ్చారు. బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మిర్యాలగూడ మార్కెట్ ఎంతగానో అభివృద్ధి చేశానని అదేవిధంగా ఇక్కడ కూడా మార్కెట్ను అభివృద్ధి చేస్తానని చెప్పారు. మార్కెట్లో రైతులకు,కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి చేస్తానని, కమిషన్ వ్యాపారుల కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారని తెలియజేశారు.