1 April, 2026 | 12:11 PM

Breaking News

దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •   మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. నిందితులకు మరోసారి కస్టడీ   •  

భూమి కోసం న్యాయపోరాటం

22-01-2026 02:43 PM

తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితుడి నిరసన 

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి తన భూమికి న్యాయం జరగాలని కోరుతూ నిరసనకు దిగాడు. లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన బాధితుడు, తన భూమిని మాజీ సర్పంచ్ అక్రమంగా కబ్జా చేశారని ఆరోపించాడు.

కోర్టు తీర్పు తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ, ఆ తీర్పును లెక్కచేయకుండా భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని రక్షించడంతో పాటు న్యాయం చేయాలని అధికారులను కోరుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బేటాయించాడు. ఘటన తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో చోటుచేసుకోగా, విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటనపై ఆసక్తి చూపుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు.