15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అసంపూర్తి డ్రైనేజీ పనులతో గ్రామస్తుల అవస్థలు

27-11-2025 12:45 AM

గట్టు, నవంబర్ 26: గట్టు మండల పరిధిలోని మాచర్ల గ్రామంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండడంతో ఈ మార్గం గుండా  రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దారి గుండా సమీపంలో ఉన్న చెన్నకేశవ స్వామి గుడికి వెళ్లే భక్తులకు... అలాగే మండల కేంద్రానికి వెళ్లే వాహనదారులకు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు ప్రజలు వాపోయారు. ఎవరైనా అనారోగ్యానికి గురై అత్యవసర పరిస్థితులు తలెత్తితే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. సంబంధిత అధికారులు అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను తొందరగా పూర్తి చేసి గ్రామస్తుల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామస్తులు కోరారు.