15 April, 2026 | 12:59 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు

04-12-2025 10:49 PM

ఎస్ఐ చిరంజీవి

తుంగతుర్తి (విజయక్రాంతి): ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక ఎస్సై చిరంజీవి అన్నారు. గురువారం నాగారం మండల పరిధిలోని నాగారం బంగ్లాలో స్థానిక ఎన్నికలపైన ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ కండక్ట్ ఆఫ్ ఎన్నికల కోడ్ ను అమలు చేసేందుకు సహకరించాలని కోరారు. ప్రచారాలకు మైకులకు అనుమతి తప్పనిసరి. ఎన్నికలలో ప్రత్యర్థి అభ్యర్థులపై ఎటువంటి దుష్ప్రచారాలు చేసిన ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని అన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ లు కిరణ్ నాగరాజు సైదులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.