05-07-2025 01:23:49 AM
నాగార్జునసాగర్, జూలై 4: ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్న తాగునీటి అవసరాల కొరకు పాలేరు రిజర్వాయర్ కు నాగార్జునసాగర్ డ్యాం నుంచి ఎడమ కాల్వకు శుక్రవారం ఎన్ఎస్ అధికారులు 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎడమకాల్వ హెడ్ రెగ్యులేటర్ వద్ద గల గేట్ ను ఎన్ఎస్పీ అసిస్టెంట్ ఇంజనీర్లు కృష్ణయ్య, విజయ్ కుమార్ లు స్విచ్ ఆన్ చేసి కాల్వలోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో నెలకొని ఉన్న తాగునీటి అవసరాల మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సాగర్ ఎడమ కాల్వ నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని సుమారు 4 రోజుల పాటు విడుదల చేస్తున్నామన్నారు.