05-07-2025 12:58:28 AM
మాజీమంత్రి హరీశ్రావు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): నాడైనా, నేడైనా తెలంగాణ ప్రయోజనాల ముందు పదవులు బీఆర్ఎస్కు తృణప్రాయమని మాజీమంత్రి హరీశ్రావు స్పష్టం చేశా రు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆయన స్పం దించారు. పోలవరం, పోతిరెడ్డిపాడు, పులిచింతల వంటి ఏపీ అక్రమ ప్రాజెక్టులను నిర సిస్తూ 20 ఏళ్ల క్రితం ఇదే రోజున మంత్రి పదవులకు రాజీనామాలు చేశామని, కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి రాష్ర్టంలోనే తెలంగాణ నీటి హక్కుల కోసం పదవులను గడ్డి పోచలుగా భావించి వదులుకున్నామని గు ర్తు చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ బనకచర్ల పేరిట గోదావరి నీటిని దోపిడి చేస్తానంటే చూస్తూ ఊరుకుంటామా అని హెచ్చరించారు. తెలంగాణ రా ష్ర్ట ప్రయోజనాలు దెబ్బ తీసే ఏ కుట్రలనైనా బీఆర్ఎస్ పార్టీ సహించదని స్పష్టం చేశారు.
పదవులకు రాజీనామాలు చేయడం మాత్ర మే కాదు, పేగులు తెగేదాకా కొట్లాడుతామని, తెలంగాణకు అన్యాయం జరగకుండా కాపలా ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే పొలిమేర దాకా తరిమికొడతాం.. ప్రాం తంవాడే ద్రోహం చేస్తే ప్రాణంతోనే పా తర వేస్తమన్న కాళోజీ మాటలను గుర్తుచేశారు.