15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

‘ప్రాణహిత’ పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం

28-10-2025 01:33 AM
  1. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం
  2. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
  3. నీటి పారుదల ప్రాజెక్టులపై సమీక్షించిన మంత్రి  

హైదరాబాద్, అక్టోబర్ 27 (విజయక్రాంతి) : ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్టును సాంకేతికంగా ఆర్థికంగా పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలించిందని తెలిపారు. సోమవారం సచివాలయంలో నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు.

సుందిళ్ల లింక్ ద్వారా సవరించిన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం అధ్యయనం చేసిందని, ఇది ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు 10 నుంచి 12 శాతం తగ్గిస్తుందని తెలిపారు. భూసేకరణను దాదాపు సగానికి తగ్గిస్తుందని, మునుపటి ప్రణాళికలతో పోలిస్తే సుమారు రూ.1,500 నుంచి 1,600 కోట్లు ఆదా చేస్తుందని చెప్పారు. తెలంగాణలోని ఎత్తున ప్రాంతాలు, కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి జలాలను తీసుకురావాలనే అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంతో పాటు,

సాంకేతిక దృఢత్వం, ఆర్థిక వివేకం, పర్యావరణ బాధ్యతను నిర్ధారించే విధంగా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టును పునర్నిర్మించడమే ప్రభుత్వ విస్తృత ఉద్దేశమని ఆయన అన్నారు. సవరించిన సుందిళ్ల లింక్ ఆచరణాత్మక, పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పరిశీలించినట్టు పేర్కొన్నారు. ఇది ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకుంటూనే బొగ్గు నిల్వ నిర్మాణాలకు సంబంధించిన మునుపటి సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని, ప్రభుత్వం బాగా తెలిసి నిర్ణయం తీసుకుంటుందన్నారు.