2 July, 2026 | 12:08 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి

30-04-2025 12:00 AM
  1. కాంట్రాక్టు ప్రొఫెసర్ల డిమాండ్
  2. యూనివర్సిటీల్లో 11వ రోజు కొనసాగిన సమ్మె

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29(విజయక్రాంతి): కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్(టీజీయూసీటీఏ) నాయకులు ప్రభుత్వా న్ని కోరారు. వారిని రెగ్యులర్ చేయాలని కోరు తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల్లో జరుగుతున్న సమ్మె 11వ రోజు కొనసాగింది. ఓయూ పరిపాలన భవనం ఎదుట కాంట్రాక్ట్ అధ్యాపకులు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు విజేందర్‌రెడ్డి, ధర్మతేజ, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, తదితరులు  మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. వేల్పుల కుమార్, ఉపేందర్, పరశురాములు, పరమేశ్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డిని కలిసి వినతిపత్రా న్ని అందజేశారు.

కాకతీయ యూనివర్సిటీలో జరిగిన సమ్మెలో జేఏసీ నాయకులు డా.ఆశీర్వాదం, డా.ఏటీపీటీ ప్రసాద్, డా.గడ్డం కృష్ణ తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని కోరారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని 1270కుటుంబాలు సమ్మెలో పాల్గొంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వివిధ యూనివర్సిటీల్లోనూ సమ్మె కొనసాగింది. ఈ సందర్భంగా పలు నిరసన కార్యక్రమాలు జరిగాయి. కార్యక్రమాల్లో డా. రామేశ్వర్, డా.కృష్ణవేణి, డా.కవిత, డా.శ్రీధర్‌కుమార్ లోథ్, డా.కనకయ్య, డా.సతీష్, డా.సూర్యనారాయణ, డా. చంద్రశేఖర్, డా.సునీత, డా.భాగ్య, డా.శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.