17 April, 2026 | 3:09 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఎడ్‌సెట్‌లో 96.38 శాతం ఉత్తీర్ణత

22-06-2025 12:17 AM
  1. 208 కాలేజీల్లో 18 వేల సీట్లు
  2. డిగ్రీ ఫలితాల తర్వాత కౌన్సెలింగ్

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): మా సాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామం డలి కార్యాలయంలో చై ర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్‌చైర్మన్ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్, కాకతీయ వర్సిటీ వీసీ ప్రతాప్‌రెడ్డితోపాటు ఎడ్‌సెట్ కన్వీనర్ బీ వెంకట్రామ్‌రెడ్డి శనివారం ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 96.38 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

పరీక్షకు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 32,106 మంది పరీక్షకు హాజరయ్యారు. 30,944 మంది ఉత్తీర్ణత సాధించారు. 7,217 మంది పురు షులు దరఖాస్తు చేసుకోగా 5,801 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 5,723 (98.66 శాతం) ఉత్తీర్ణులయ్యారు. మహిళలు 31,536 మంది దరఖాస్తు చేసుకోగా, 26,304 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 25,220 (95.88 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాక ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 208 కాలేజీల్లో గతేడాది 18,550 సీట్లకుగానూ 14,420 సీట్లు భర్తీ అయినట్టు పేర్కొన్నారు. గతంలో కంటే ఈసారి 8 వేల దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయన్నారు.

ఉపాధ్యాయ కోర్సు చేసే వారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారని వెల్లడించారు. గతంలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును అందుబాటులోకి తీసుకురావాలకున్నారు. కానీ, ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేయూ వర్సిటీ వీసీ ఈమేరకు తెలిపారు.