17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

దేశవ్యాప్త సమ్మెకు సన్నద్ధం కావాలి

04-05-2025 05:32 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయడానికి కార్మికులు, ప్రజలు సన్నద్ధం కావాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్వాతంత్రానికి పూర్వం నుండి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను అమరులోకి తెచ్చిందని విమర్శించారు.

ఎనిమిది గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచిందని విమర్శించారు. కార్మికులకు కనీస వేతనాల అమలు స్కీం వర్కర్స్ సమస్యలు, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రం పనిచేస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ, కార్మికుల ప్రయోజనాలు సంక్షేమం కోసం సంఘటితంగా పోరాటం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆ సంఘం నాయకులు జే.వెంకటేష్, కాసు మాధవి, వంగూరి రాములు, పాలడుగు సుధాకర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్ పాల్గొన్నారు.